మృతి చెంది 24 గంట‌లైనా

ప‌ట్టించుకోని శానిట‌రీ సూప‌ర్‌వైజ‌ర్లు

శానిట‌రీ సూప‌ర్‌వైజ‌ర్ ర‌వివంద‌నంపై మొగ‌రాల ఆగ్ర‌హం

ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో పారిశుధ్యం అధ్వానంపై సూప‌ర్‌వైజ‌ర్‌కి క్లాస్ పీకిన HDS మెంబెర్

N3 ఎఫెక్ట్

మృతి చెంది 24 గంట‌లైనా….

  • ప‌ట్టించుకోని శానిట‌రీ సూప‌ర్‌వైజ‌ర్లు
  • శానిట‌రీ సూప‌ర్‌వైజ‌ర్ ర‌వివంద‌నంపై మొగ‌రాల ఆగ్ర‌హం
  • ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో పారిశుధ్యం అధ్వానంపై సూప‌ర్‌వైజ‌ర్‌కి క్లాస్ పీకిన HDS మెంబెర్
  • N3 ఎఫెక్ట్

ఎన్ 3 న్యూస్ ప్ర‌చురించిన…నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం అంటూ బ్రేకింగ్ ప్లేట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. డెడ్ బాడీ కంపోజ్ అయి దుర్వాసన వెదజల్లుతుందని స్థానికులు, పేషెంట్ల త‌ర‌పున బంధువులు ఆసుప‌త్రి నిర్వాహ‌కుల‌పై మండిప‌డ్డారు. ఈ విష‌యం తెలుసుకున్న HDS మెంబెర్ మొగరాల సురేష్ జీజీహెచ్‌కు చేరుకున్నారు. RO ప్లాంట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది 24 గంటలైనా జీజీహెచ్ శానిట‌రీ సూప‌ర్ వైజ‌ర్లు పట్టించుకోక‌పోవ‌డంతో ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌నిషి చ‌నిపోయి 24 గంట‌లైనా ఎందుకు ప‌ట్టించుకోలేద‌ని…అస‌లు మీరేం చేస్తున్నార‌ని నిల‌దీశారు. దీనికి శానిట‌రీ సూప‌ర్‌వైజ‌ర్ ర‌వివంద‌నం పొంత‌న లేని స‌మాధానాలు చెప్ప‌డంతో మొగ‌రాల సురేష్ మండిప‌డ్డారు. వెంట‌నే ఆసుప‌త్రి సిబ్బందిని పిలిపించి మృత‌దేహాన్ని మార్చురీకి త‌ర‌లించారు. అలాగే ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో అధ్వానంగా త‌యారైన పారిశుధ్యంపై సూప‌ర్‌వైజ‌ర్ల‌కి క్లాస్ పీకారు. పారిశుధ్యం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. ల‌క్ష‌లు మంజూరు చేస్తుంటే….ఇంత దారుణంగా ఉంచుకుంటారంటూ ఫైర్ అయ్యారు. వెంట‌నే ఆసుప‌త్రి ఆవ‌ర‌ణాన్ని శుభ్రం ఉంచక‌పోతే….బిల్లులు నిలిపి వేస్తాన‌ని హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *