కుప్పం నియోజకవర్గంలో కడ ఆధ్వర్యంలో భారీ జాబ్మేళా
జాబ్ మేళాకు పెద్ద ఎత్తున స్పందన
14 కంపెనీలు.. 700 మంది యువత హాజరు
ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా..!
-కుప్పం నియోజకవర్గంలో కడ ఆధ్వర్యంలో భారీ జాబ్మేళా
-జాబ్ మేళాకు పెద్ద ఎత్తున స్పందన
-14 కంపెనీలు.. 700 మంది యువత హాజరు
సిఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో.. వన్ ఎం..వన్ బి వారి జాబ్ మేళాను మంగళవారం కుప్పం పట్టణంలోని కడ కార్యాలయంలో నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. జాబ్ మేళాలో 14కి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతీ, యువకులు తరలి వచ్చారు. జాబ్ మేళా ద్వారా 700మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని.. కడ పిడి వికాస్ మర్మత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి సురేష్ బాబు, కుప్పం నియోజకవర్గ జనసేన అధ్యక్షులు నరేష్, కౌన్సిలర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.