మంత్రులు, ఎమ్మెల్యేలను కలసిన బీద రవిచంద్ర యాదవ్
నెల్లూరు నుంచి బీదను అభినందించిన నేతలు
మీ.. సహకారం ఉండాలి
-మంత్రులు, ఎమ్మెల్యేలను కలసిన బీద రవిచంద్ర యాదవ్
-నెల్లూరు నుంచి బీదను అభినందించిన నేతలు
రెండో సారి ఎమ్మెల్సీగా ఎన్నికైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ బుధవారం ఉదయం అసెంబ్లీ ఆవరణంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ముఖ్య నేతలను నేరుగా వెళ్లి.. వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి.. శాలువాలతో సత్కరించారు. తనకు ఎమ్మెల్సీ వచ్చినందుకు మీ అందరి సహకారం ఉందని.. రానున్న భవిష్యత్తులోనూ తనకు అన్ని విధాలా సహకారం అందించాలని వారిని బీద రవిచంద్ర కోరారు. ముఖ్యంగా మంత్రులు పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పులివర్తి నాని, సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులను కలిశారు. అలాగే.. నెల్లూరు, కావలి నుంచి కూడా పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు బీద అభిమానులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలసి.. పుష్ఫ గుచ్ఛాలు అందజేశారు. వీరిలో డాక్టర్ జడ్. శివప్రసాద్, దువ్వూరు కళ్యాణ్రెడ్డి, కోడూరు కమలాకర్రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, కొండూరు పోలిశెట్టి, తదితరులున్నారు.