4 కేజీల బంగారం తరలిస్తున్న నెల్లూరు యువకులు
వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద పట్టుకున్న విజిలెన్స్ అధికారులు
బంగారం, కారుని సీజ్ చేసిన అధికారులు
చెన్నై టూ నెల్లూరు….
- 4 కేజీల బంగారం తరలిస్తున్న నెల్లూరు యువకులు
- వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద పట్టుకున్న విజిలెన్స్ అధికారులు
- బంగారం, కారుని సీజ్ చేసిన అధికారులు
విజలెన్స్ ఎస్పీ రాజేంద్రకుమార్ ఆదేశాల మేరకు… విజిలెన్స్ అధికారులు నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. చెన్నై నుంచి నెల్లూరుకు భారీగా బంగారం తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు నిఘా పెట్టారు. సీఐ నరసింహారావు, విష్ణురావులు తమ సిబ్బందితో టోల్ గేటు వద్ద ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నెల్లూరు నగరానికి చెందిన హర్షజైన్, అన్నారామ్, నల్లారి రంజిత్కుమార్లను సరైన బిల్లులు లేకుండా 4 కేజీల 189 గ్రాముల బంగారు ఆభరణాలను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని బంగారు ఆభరణాలు, కారును సీజ్ చేశారు. సీజ్ చేసిన బంగారు విలువ సుమారు రూ. 3 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.విచారాణ నిమిత్తం బంగారు ఆభరణాలు, కారును జీఎస్టీ అధికారులకు అప్పగిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలియజేశారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే బంగారు తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.