ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే
ఫైన్లు పెరిగాయి…
- ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే
భారతదేశంలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం నిత్యం ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతూనే ఉంది. అయినప్పటికీ వాహన చోదకుల్లో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదని పోలీసు అధికారుల గణాంకాలు తెలుపుతున్నాయి. మార్చి నెల ప్రారంభం కాక ముందు వరకు ఒక నెల రోజులపాటు రోడ్డు భద్రతపై ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేపట్టినప్పటికీ నేటికీ అధిక మొత్తంలో చలానాలు నమోదవుతున్నాయి