జ‌న‌వార‌ధి సొసైటీ ఆధ్వ‌ర్యంలో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు

పారిశుధ్య కార్మికుల‌కు నూత‌న వ‌స్త్రాలు అంద‌జేసిన మోపూరు రిషిత‌

శివాజీయూత్‌ఫౌండేష‌న్‌, జ‌న‌వార‌ధి సేవ‌ల‌ను కొనియాడిన కార్పొరేట‌ర్ చ‌క్కా అహల్య‌

స్వ‌చ్ఛ‌సార‌ధులు మ‌న పారిశుధ్య కార్మికులు

  • జ‌న‌వార‌ధి సొసైటీ జిల్లా నూత‌న సార‌ధి డాక్ట‌ర్ మోపూరు భాస్క‌ర్‌నాయుడు ఆధ్వ‌ర్యంలో వేడుక‌లు
  • మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా పారిశుధ్య‌కార్మికుల‌కు ఘ‌న స‌త్కారం
  • శివాజీయూత్‌ఫౌండేష‌న్‌, జ‌న‌వార‌ధి సేవ‌ల‌ను కొనియాడిన కార్పొరేట‌ర్ చ‌క్కా అహల్య‌

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల‌ను శివాజీ యూత్‌ఫౌండేష‌న్‌, జ‌న‌వార‌ధి సొసైటీ సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 28వ డివిజ‌న్‌లో జ‌న‌వార‌ధి సొసైటీ జిల్లా నూత‌న సార‌ధి డాక్ట‌ర్ మోపూరు భాస్క‌ర్‌నాయుడు ఆదేశాల మేర‌కు మోపూరు రిషిత ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన వేడుక‌ల్లో కార్పొరేట‌ర్ చ‌క్కా అహల్య ముఖ్యఅతిథిగా విచ్చేయ‌గా పారిశుధ్య కార్మికుల‌తో క‌లిసి కేక్ క‌ట్ చేసి సంబ‌రాలు చేశారు. స్వ‌చ్ఛ‌సార‌ధులు మ‌న పారిశుధ్య కార్మికుల ప‌నితీరును వారు కొనియాడుతూ నూత‌న వ‌స్త్రాలు, దుప్ప‌ట్లు, భోజ‌నం అంద‌జేశారు. మ‌హిళా దినోత్స‌వం రోజున పారిశుధ్య కార్మికుల‌ను సన్మానించుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని శివాజీ యూత్ ఫౌండేష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ మోపూరు రిషిత అన్నారు. జ‌న‌వార‌ధి నెల్లూరు జిల్లా నూత‌న సార‌ధి డాక్ట‌ర్ మోపూరు భాస్క‌ర్‌నాయుడును నియ‌మించ‌డం అభినంద‌నీయ‌మ‌ని కొనియాడారు. త‌ద్వారా త‌మ సేవా కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత విస్తృతం చేస్తామ‌ని తెలిపారు. అనంత‌రం కార్పొరేట‌ర్ చ‌క్కా అహ‌ల్య మాట్లాడుతూ మ‌హిళా దినోత్స‌వం రోజున పారిశుధ్య‌కార్మికుల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ శివాజీయూత్‌ఫౌండేష‌న్‌, జ‌న‌వార‌ధి సొసైటీ సంయుక్తంగా స‌త్క‌రించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బ్ర‌హ్మాస్ ఎడ్యూకేష‌న‌ల్ చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఛైర్‌ప‌ర్స‌న్ గాలాజు నాగ‌మ‌ణి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *