ప్రభుత్వాన్ని హెచ్చరించిన సీపీఎం
నెల్లూరులో కొనసాగుతున్న సీపీఎం ప్రజా చైతన్య యాత్ర
పట్టాలిచ్చేంత వరకు పోరాటం ఆగదు…
- ప్రభుత్వాన్ని హెచ్చరించిన సీపీఎం
- నెల్లూరులో కొనసాగుతున్న సీపీఎం ప్రజా చైతన్య యాత్ర
అన్ని ప్రాంతాలలో ఇళ్లకు, స్థలాలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని… ఇచ్చేంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీపీఎం పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలు నెల్లూరులో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నెల్లూరు నగరం 54వ డివిజన్,జనార్దన్ రెడ్డి కాలనీ, లక్ష్మీపార్వతి నగర్ లలో ప్రజా చైతన్య యాత్రలు చేపట్టారు. ఇంటింటికెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు అనేక సమస్యలను సీపీఎం నేతల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యల పరిష్కార కోసమే ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమానికి తమ పార్టీ శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వామ్యం కూడా కావాలని పిలుపునిచ్చారు. యాత్రలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.