మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు
వీరి చలపతిరావుని ఇబ్బందిపెట్టాలంటే తరం కాదు
-మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు
కోవూరు నియోజకవర్గం.. కొడవలూరు మండలం.. నార్త్ రాజుపాలెంలోని వి సి ఆర్ అతిధి గృహంలో వైసిపి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. నిన్నటి రోజున టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మా నాయకుడు వీరి చలపతిరావు పై లేనిపోని ఆరోపణలు చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదని.. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలుగా మా నాయకుడు వీరి చలపతిరావు ని ఏదోవిధంగా ఇబ్బందులు పెట్టాలని బూతద్దం పెట్టి మరి వెతుకుతున్నారని అన్నారు , వీరి చలపతిరావు ప్రజలకు మంచిచేసే వ్యక్తి అని, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆధారాలతో ఎదురుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. టిడిపి నాయకులు మాట్లాడే సమయంలో ఆధారాలతో మాట్లాడితే బాగుంటుందని వారు హితవు పలికారు. ఈ సమావేశంలో ఎంపిపి గాలి జ్యోతి , సర్పంచ్ బొచ్చు సుప్రియ , భాస్కర్ , నాగిరెడ్డి రమేష్, మాణిక్యరావు , గాలి సునీల్ కొండా శ్రీనివాసులు రెడ్డి స్థానిక వైసిపి నాయకులు పాల్గొన్నారు.