ఓ దళిత వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తి పై సస్పెన్షన్ లేదా…?
ఓ దళిత యువకుడిని పెట్రోల్ బంకులు దాడిచేసిన వ్యక్తిపై సస్పెన్షన్ ఉండదా…?
మీడియా సమావేశంలో టిడిపి ఎమ్మెల్యేను పొగిడిన వైసీపీ నేతపై పార్టీ చర్యలు ఉండవా..?
కావలి వైసీపీ నేత సస్పెన్షన్ తీరుపై వైసీపీలో భిన్నభిప్రాయాలు
వైసీపీలో సుకుమార్ రెడ్డిది కర్ణుడి పాత్రేనా…!
- ఓ దళిత వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తి పై సస్పెన్షన్ లేదా…?
- ఓ దళిత యువకుడిని పెట్రోల్ బంకులు దాడిచేసిన వ్యక్తిపై సస్పెన్షన్ ఉండదా…?
- మీడియా సమావేశంలో టిడిపి ఎమ్మెల్యేను పొగిడిన వైసీపీ నేతపై పార్టీ చర్యలు ఉండవా..?
- కావలి వైసీపీ నేత సస్పెన్షన్ తీరుపై వైసీపీలో భిన్నభిప్రాయాలు
కావలి వైసిపి నేత మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి సస్పెన్షన్ పార్టీలో కాక రేపుతుంది. ఆయన సస్పెన్షన్ తీరు వైసీపీలో సుకుమార్ రెడ్డిది ఎప్పుడు కర్ణుడు పాత్రేనా అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పార్టీ కోసం ఎంతకైనా తెగబడే సుకుమార్ రెడ్డికి ఒక న్యాయం ఇతర నాయకులు పట్ల మరొక న్యాయమా అంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అవినీతి అక్రమాలకు పాల్పడి పార్టీకి చెడ్డ పేరు తెచ్చినట్లు సుకుమార్ రెడ్డి పై తొలుత సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు పార్టీ ఇన్చార్జిని ఎదిరించి పార్టీలైన్ దాటినట్లు రెండోసారి సస్పెన్షన్ చేశారు. సుకుమార్ రెడ్డి తొలిసారి సస్పెన్షన్ చేసిన తర్వాత కావలిలో గ్రావెల్ దందా ఇసుక మాఫియా అక్రమ లేఅవుట్ల నిర్మాణం ఆగిందా..? ఇంకా రెట్టింపు అవినీతి, అక్రమాలు జరిగాయి.. వీటి వెనుక ఎవరున్నారు..మరి ఇందుకు బాద్యులైన వారిని పార్టీ గుర్తించి సస్పెన్షన్ చేసిందా అని నిలదీస్తున్నారు. ఇదిలా ఉంటే కావలిలో ఒక దళిత వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరువుపోతే మరి ఆ వ్యక్తిని ఎందుకు సస్పెన్షన్ చేయలేదని, మరో దళిత యువకుడిని పెట్రోల్ బంకులో కొట్టిన వైసీపీ నేత వల్ల పార్టీ పరువు పోలేదా…? ఇటీవల సుకుమార్ రెడ్డి తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొని టిడిపి ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డిని పొగిడిన నేతపై ఏం చర్యలు తీసుకున్నారో పార్టీ అధిష్ఠానం చెప్పాలని డిమాండ్ వినొస్తుంది. పార్టీ ఇన్చార్జిని ఎదిరిస్తే సస్పెన్షన్లు, ఏం చేసినా చేతులు కట్టుకుంటే ప్రమోషన్లా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ సస్పెన్షన్ పై సుకుమార్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి…