గిరి ప్రదక్షిణతో ప్రసన్నుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంట బిలకూట క్షేత్రం ప్రసన్న వెంకటేశ్వర స్వామి

బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఆగమశాస్త్ర ప్రకారం ఉత్సవమూర్తులతో గిరి ప్రదక్షణ

ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి, ఆర్డీవో వంశీ కృష్ణ దంపతులు హాజరు

గిరి ప్రదక్షిణతో ప్రసన్నుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

  • నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంట బిలకూట క్షేత్రం ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
  • ఆగమశాస్త్ర ప్రకారం ఉత్సవమూర్తులతో గిరి ప్రదక్షణ
  • ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి, ఆర్డీవో వంశీ కృష్ణ దంపతులు హాజరు

నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంట బిలకూట క్షేత్రం ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభం అయ్యాయి. తొలి రోజుగా ఆగమశాస్త్ర ప్రకారం ఉత్సవమూర్తులతో గిరి ప్రదక్షణ చేశారు. ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి, ఆర్డీవో వంశీ కృష్ణ దంపతులు హాజరై గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆగమ శాస్త్ర ప్రకారం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నారదుడు మహర్షి స్థాపించిన ఈ ప్రసన్నుడి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుంటే ముక్కోటి దేవతల దర్శన భాగ్యం కలుగుతుందని ఆగమ శాస్త్రం చెబుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీధర్, ఈవో రాధ కృష్ణ, టీడీపి నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *