సంగంలో ఫిజియోథరఫీపై అవగాహన
ప్రతీ ఒక్కరూ మెడిటేషన్ చేయాలి…
- సంగంలో ఫిజియోథరఫీపై అవగాహన
నెల్లూరు జిల్లా సంగం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బందికి ఫిజియోథెరపీ పై డాక్టర్లు రమేష్, సంతోష్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జీవన విధానంలో జరుగుతున్న పలు రకాల మార్పులపై వారికి అవగాహన కల్పించారు.పెయిన్ కిల్లర్లు వాడటం వలన కలిగే నష్టాల గురించి ..మొబైల్ రేడియేషన్ తో వచ్చే అనర్ధాల గురించి వారికి వివరించారు. ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ షాలెట్, ఈఓపిఆర్డి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.