భ‌గ్గుమ‌న్న భూ త‌గాదాలు

వెంక‌టేశ్వ‌ర్లు కుటుంబంపై శ్రీ‌నివాసులు క‌త్తితో దాడి

ఇందుకూరుపేట‌లో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఘ‌ట‌న

భ‌గ్గుమ‌న్న భూ త‌గాదాలు…

  • వెంక‌టేశ్వ‌ర్లు కుటుంబంపై శ్రీ‌నివాసులు క‌త్తితో దాడి
  • ఇందుకూరుపేట‌లో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఘ‌ట‌న

భూ త‌గాదాల నేప‌థ్యంలో ఓ కుటుంబంపై ఇద్ద‌రు వ్య‌క్తులు క‌త్తితో దాడికి పాల్ప‌డిన సంఘ‌ట‌న‌… నెల్లూరు జిల్లా కోవూరు నియోజ‌క‌వ‌ర్గం ఇందుకూరుపేట మండ‌లం చంటివారి కండ్రిగ గ్రామంలో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. చంటివారి కండ్రిగ గ్రామంలో నెట్రంపాక శ్రీ‌నివాసులు, నెట్రంపాక వెంక‌టేశ్వ‌ర్లు నివాసం ఉంటున్నారు. పొలం విష‌యంలో గ‌త కొద్ది రోజులుగా ఇరువురి మ‌ధ్య వివాదాలు న‌డుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో శ్రీ‌నివాసులు అత‌ని త‌ల్లి ఇద్ద‌రూ క‌లిసి…త‌న కుటుంబంపై క‌త్తితో దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌ర‌చిన‌ట్లు బాధితుడు వెంక‌టేశ్వ‌ర్లు తెలిపారు. దీనిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తామ‌న్నారు. త‌మ కుటుంబానికి ప్రాణ హాని ఉంద‌ని…ర‌క్ష‌ణ క‌ల్పించి త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *