మిన‌ర‌ల్ వాట‌ర్‌లో పురుగుల మందు

ఇది వాట‌ర్ ప్లాంటా…? పురుగుల మందు స్ప్రే దుకాణ‌మా…?

ఇదెక్క‌డో N3లో చూడాల్సిందే

మిన‌ర‌ల్ వాట‌ర్‌లో పురుగుల మందు…

  • ఇది వాట‌ర్ ప్లాంటా…? పురుగుల మందు స్ప్రే దుకాణ‌మా…?
  • ఇదెక్క‌డో N3లో చూడాల్సిందే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి సాయిబాబా ఆలయం ప‌క్కన ఓ మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్ ఉంది. అదే ప్లాంట్‌లో వాట‌ర్ క్యానుల‌తోపాటు… పంట పొలాల్లో పిచికారి చేసే పురుగులు డ‌బ్బాలు, స్ప్రేలు త‌దిత‌ర సామాగ్రి ఉన్నాయి. స్థానికులు తాగేందుకు వాట‌ర్ క్యాన్ తీసుకెళ్ల‌గా…ఆ నీళ్లంతా పురుగుల మందు వాస‌న రావ‌డాన్ని గుర్తించారు. దీంతో వారు వాట‌ర్ ప్లాంట్ చేరుకొని…నీళ్లు పురుగుల మందు వాస‌న వ‌స్తున్నాయ‌ని ప్ర‌శ్నించారు. య‌జ‌మాని నిర్ల‌క్ష్యంగా స‌మాధానం ఇస్తున్నార‌ని వాపోయారు. ఇంత జ‌రుగుతున్నా అధికారులు ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా ఉన్న‌తాధికారులు స్పందించి మిన‌ర‌ల్ వాట‌ర్ ప్లాంట్‌లో పురుగుల మందు దుకాణాన్ని ఎత్తి వేయాల‌ని డిమాండ్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *