రిలయన్స్ భూముల్లో చుక్కల దుప్పులు…!

దుప్పుల ఆనవాళ్ళ కోసం అటవీ అధికారుల పరిశీలన

ప్రత్యామ్నాయ అవాసలకు వెళ్ళిఉండొచ్చన్న అధికారులు

జాగ్రత్త చర్యలు చేపట్టాలని రిలయన్స్ సిబ్బందికి సూచన

రిలయన్స్ భూముల్లో చుక్కల దుప్పులు…

  • దుప్పుల ఆనవాళ్ళ కోసం అటవీ అధికారుల పరిశీలన
  • ప్రత్యామ్నాయ అవాసలకు వెళ్ళిఉండొచ్చన్న అధికారులు
  • జాగ్రత్త చర్యలు చేపట్టాలని రిలయన్స్ సిబ్బందికి సూచన

జిల్లా అటవీ శాఖ అధికారి ఆదేశాలతో రిలయన్స్ భూములలో వన్యప్రాణుల జాడను పరిశీలించడం జరిగిందని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పరిధిలో ఉన్న రిలయన్స్ భూములలో స్థానిక పోలీసులు, రిలయన్స్ సెక్యూరిటీ సిబ్బంది తో కలసి అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. చుక్కల దుప్పులను కొందరు గమనించినట్లు సమాచారం ఇవ్వడంతో అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా సెక్షన్ ఆఫీసర్ మీడియాతో మాట్లాడుతూ… యాత్రలతో చదును చేస్తున్నందును ఎటువంటి జంతువుల పాద ముద్రలు కనిపించలేదని..ఒకవేళ ఏవైనా వన్యప్రాణులు ఉండి ఉంటే సమీపంలో ఉన్న పచ్చటి పొలాలు, పొదల్లోకి వెళ్ళిఉండొచ్చని చెప్పారు. జంతువులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని రిలయన్స్ సిబ్బందికి అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *