ఫోర్జ‌రీ సంత‌కాల‌తో

డిపాజిటర్ల రూ. 31 ల‌క్ష‌ల‌ న‌గ‌దును నొక్కేసిన పోస్ట‌ల్ శాఖ‌ ఏజెంట్‌

పోలీసుల‌కి ఫిర్యాదు చేసిన ఆరుగురు డిపాజిట్‌దారులు

ఏపీ పోస్టల్ శాఖలో భారీ స్కామ్ – ఆత్మ‌కూరులో వెలుగు చూసిన ఘ‌ట‌న‌

ఫోర్జ‌రీ సంత‌కాల‌తో…

  • డిపాజిటర్ల రూ. 31 ల‌క్ష‌ల‌ న‌గ‌దును నొక్కేసిన పోస్ట‌ల్ శాఖ‌ ఏజెంట్‌
  • పోలీసుల‌కి ఫిర్యాదు చేసిన ఆరుగురు డిపాజిట్‌దారులు
  • ఏపీ పోస్టల్ శాఖలో భారీ స్కామ్
  • ఆత్మ‌కూరులో వెలుగు చూసిన ఘ‌ట‌న‌

ఫోర్జ‌రీ సంత‌కాలు చేసి…పోస్టాఫీసులో డిపాజిట్ చేసిన ఖాతాదారుల న‌గ‌దును దోచుకున్న సంఘ‌ట‌న నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు మండ‌లంలో వెలుగులోకి వ‌చ్చింది. ఏళ్ల త‌ర‌బ‌డి డిపాజిట్ చేస్తున్న డ‌బ్బుల‌ను ఏజెంటే నొక్కేశాడ‌ని బాధితులు ల‌బోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. షేక్ ఇమామ్ కాశీం అనే వ్యక్తి ఆత్మకూరు పోస్ట్ ఆఫీస్‌లో పోస్టల్ ఏంజెట్‌గా పని చేస్తున్నాడు. అదే పోస్ట్ ఆఫీస్‌లో దగుమాటి నారాయణ రెడ్డి, దగుమాటి నారయనమ్మ, పీ, సుజాత, రాజమ్మ, డీ శ్వేత, స్వాతిలు అదే పోస్ట్ ఆఫీస్‌లో కొంత కాలంగా వారి ఖాతాల్లో డబ్బులను డిపాజిట్ చేస్తున్నారు. అందులో పని చేస్తున్న షేక్ ఇమమ్ కాశీం వీళ్ల సేవింగ్ అకౌంట్స్‌తో పాటు టీడీఐ, ఎన్ఎస్‌సీ, కేవైసిలను గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వారి సంతాకాలను ఫోర్జరీ చేసి డిపాజిట్ చేసిన డబ్బులను ఏజెంట్ షేక్ ఇమామ్ దోచుకున్నాడు. వారికి తెలియకుండా 3 సంవత్సరాలుగా దాదాపు రూ. 30 లక్షలను తానే డ్రా చేసుకుని సొంత ఖర్చులకు వాడుకున్నాడు. ఈ బ్రాంచి నుంచి ఖాతాల్లోని నగదు లేకపోవడంతో ఖాతాదారుల్లోనూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో బాదితులు పోస్టల్ ఏజెంట్‌ను నిలదీయడంతో తానే వారి సంతకాలు ఫోర్జరీ చేసి డిపాజిట్ చేసిన డబ్బులను తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పొద్దని బాధితులను ఇమామ్ ఖాసీ బ‌తిమిలాడుకున్నాడు. అంతే కాకుండా అలా అక్రమంగా తీసుకున్న డబ్బులను రిటర్న్ ఇచ్చేందుకు వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారి వద్ద నుంచి కాజేసిన రూ. 30 లక్షలను తిరిగి ఇచ్చేందుకు బాధితులతో కాగితంపై రాయించుకున్నాడు. తప్పు ఒప్పుకుని బాధితులకు వారి డబ్బులు ఇవ్వకుండా ప్లేట్ ఫిరాయించాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల నుండి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *