సింహపురి కేనే స్పోట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహణ
పాల్గొన్న ఆంధ్రా, తమిళనాడు, కర్నాటక సీనియర్ మాస్టర్లు
ముత్తుకూరు లో బాక్సింగ్ సెమినార్…
- సింహపురి కేనే స్పోట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహణ
- పాల్గొన్న ఆంధ్రా, తమిళనాడు, కర్నాటక సీనియర్ మాస్టర్లు
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో సింహపురి కేనే స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో బాక్సింగ్ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ ని టీడీపీ సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సింహపురి కేనే స్పోర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు రేంషి ధనూష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెమినార్ లో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన సీనియర్ మాస్టార్లు పాల్గొని కలర్ బెల్ట్ నుంచి బ్లాక్ బెల్ట్ వరకు ఉన్న బెల్ట్ ఎక్జమినేషన్ నిర్వహించారు. అనంతరం పలువురు క్రీడాకారులు కరాటే విన్యాసాలు చేశారు. బాక్సింగ్ సెమినార్ లో 60 మంది క్రీడాకారులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టెక్నీకల్ డైరెక్టర్ శ్రీనివాసులు, సీనియర్ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.