క‌లెక్ట‌ర్ గారు న్యాయం చేయండి

క‌లెక్ట‌ర్ గారు న్యాయం చేయండి…

  • జీఎస్‌టీ హేచ‌రీపై క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదుకు చేసిన ఆక్వా రైతులు
  • నాణ్య‌త లేని సీడ్ వ‌ల్ల న‌ష్ట‌పోయామంటూ ఆవేద‌న

నాణ్యతలేని రొయ్యల సీడ్ కారణంగా రైతులు నరకం చూస్తున్నారని…జీఎస్‌టీ హేచ‌రీపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకొని త‌మ‌కు న్యాయం చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆనంద్‌ను నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండ‌ల ఆక్వా రైతులు కోరారు. ఈ సంద‌ర్భంగా వారు నెల్లూరు క‌లెక్ట‌రేట్‌లో సోమ‌వారం జ‌రిగిన ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌లో అధికారికి విన‌త ప‌త్రం అంద‌చేశారు. అనంత‌రం రైతు దువ్వూరు విజయసేనా రెడ్డి ఎన్‌3 న్యూస్‌తో మాట్లాడారు. జీఎస్టీ హేచ‌రీ విక్ర‌యించే నాణ్యత లేని వెనామీ సీడ్ బాధిత రైతులు దగాకు గురి అవుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వెంట‌నే క‌లెక్ట‌ర్ స్పందించి జీఎస్టీ హేచ‌రీపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో రైతులు పోలం రాజుగుంట చెందిన రైతులు దువ్వూరు దువ్వూరు కోదండరామిరెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *