చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ధర్నా
రోడ్డెక్కిన కార్మికులు…
- చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ధర్నా
చిత్తూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్మికుల ఐక్యతా వర్ధిల్లాలి…తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ పరిధిలోని పనిచేస్తున్న కార్మికులను కమిషనర్ పరిధిలోనే ఉంచుకొని వారిని పెర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మున్సిపల్ కార్మికులకు నేరుగా జీతాలను మున్సిపాలిటీలో చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు జోరుపల్లి రామచంద్రయ్య, ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, యూనియన్ నాయకులు, మున్సిపల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.