వింజమూరులో నామమాత్రంగానే ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ఖాళీ కుర్చీలు దర్శనం
వేదికకు అధికారులు డుమ్మా…
- వింజమూరులో నామమాత్రంగానే ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- ఖాళీ కుర్చీలు దర్శనం
ప్రజా సమస్యల పరిష్కార కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికను తీసుకువచ్చింది. అయితే ఈ వేదికకు అర్జీదారులు తరలివస్తున్నా….ఉండాల్సిన అధికారులు డుమ్మా కొడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా వింజమూరులోని తహసీల్దార్, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో….అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ వేదికకు సుమారు 12 శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా…కేవలం నాలుగు శాఖల అధికారులు హాజరై…మిగతా అధికారులందరూ డుమ్మా కొట్టారు. దీంతో…వేదికలోని కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తమ సమస్యలపై వినతులను అధికారులకు అందించేందుకు మండల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అధికారులు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధికారులందరూ హాజరయ్యేలా చూడాలని అర్జీదారులు కోరుతున్నారు.