రాపూరులో 144 సెక్షన్ అమలు
ఇంటర్ సెకండీయర్ పరీక్షలు ప్రారంభం
- రాపూరులో 144 సెక్షన్ అమలు
నెల్లూరు జిల్లా రాపూరం మండలం సి వి కె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ కళాశాలలో రాపూరు ప్రభుత్వ కళాశాల, కండలేరు ప్రభుత్వ కళాశాల, వినాయక కళాశాలలకు సంబంధించిన విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. గంట ముందే పరీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరుకున్నారు. పరక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు అధికారులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.