హాజరుకానున్న ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖర్
. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
. కేంద్ర మంత్రులు, ఎంపీలు, తెలుగురాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ కుమారుడి గోకుల్ రిష్వంత్-దివిజల వివాహ వేడుక గతనెల 23న నెల్లూరు వీపీఆర్ కన్వన్షన్లో అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈవివాహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు రెండు తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రాజకీయ, వ్యాపార దిగ్గజాలు హాజరయ్యారు. ఈ వివాహ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్లోని షంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరున్న పోర్ట్ గ్రాండ్ లో పెళ్లి రిసెప్షన్ వేడుక జరగనుంది. బీద రవిచంద్ర ఆహ్వానం మేరకు..
ఈ రిసెప్షన్కు ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖర్తోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నారా లోకేష్, భువనేశ్వరి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, కిషన్రెడ్డి, బండి సంజయ్, ఆధ్ర, తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. అలాగే.. రవిచంద్ర యాదవ్ ఉమ్మడి రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో యువతలో పనిచేసిన నేతలు, నాయకులు ప్రస్తుతం వివిధ పార్టీల్లో ఉన్న తన రాజకీయ సహచరులందర్నీ ఆహ్వానించారు. ఈ రిసెప్షన్ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది.