జిల్లాలొ తెల్లవారగానె ఎన్టీఆర్ బరోసా పెన్షన్ల పంపిణీ నగరా
ఎమ్మేల్యే ఇన్ పెన్షన్ పంపిణీ
తిరుపతి జిల్లాలొ తెల్లవారగానె ఎన్టీఆర్ బరోసా పెన్షన్ల పంపిణీ నగరా మ్రోగింది. వెంకటగిరి నియోజకవర్గంలోని వెంకటగిరి మున్సిపాలిటి పరిధిలోని 25 వార్డులో ఉదయం 6 గంటల నుండి స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు పెన్షన్ పంపిణీలొ పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఎమ్మేల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. గత వైసీపి ప్రభుత్వం ఒకటో తారీకున పెన్షన్లు ఇచ్చిన దాఖలు లేవని.. అయితె చంద్రబాబు నాయుడు ఎక్కడ నుండి నిధులు తెస్తున్నాడో గాని పెన్షన్ దారుల మీద ప్రేమ అభిమానాలతో ఒకటో తారీకు సెలవు దినమైతె ముందు రోజే పెన్షన్ పంపిణీ చేస్తున్నారని పేర్కోన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికి ఎక్కడా మట్టి రోడ్డు అనేది కనబడకుండా సిమెంట్ రోడ్లు, తారు రోడ్ల వేస్తు దీమగా రోడ్ల పై ప్రయాణం చేయగలిగే పరిస్థితులను చేస్తున్నారని తెలియజేసారు