ఘనంగా ఉద‌య క‌ళేశ్వ‌ర‌స్వామి తెప్పోత్స‌వం

తెప్పోత్స‌వాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డి

వేమిరెడ్డి ప‌ట్టాభి, వీబీఆర్ ఆధ్వ‌ర్యంలో వైభ‌వంగా జ‌రుగుతున్న శ్రీ‌గంగా పార్వ‌తి ఉద‌య కాళేశ్వ‌రస్వామి

మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు

ఘనంగా ఉద‌య క‌ళేశ్వ‌ర‌స్వామి తెప్పోత్స‌వం
-తెప్పోత్స‌వాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డి

  • వేమిరెడ్డి ప‌ట్టాభి, వీబీఆర్ ఆధ్వ‌ర్యంలో వైభ‌వంగా జ‌రుగుతున్న
    శ్రీ‌గంగా పార్వ‌తి ఉద‌య కాళేశ్వ‌రస్వామి మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు

నెల్లూరు జిల్లా.. కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. కొడవలూరు మండలం.. గండ‌వ‌రం గ్రామంలో శ్రీ గా పార్వతి ఉదయ కాళేశ్వరి స్వామి వారి దేవస్థానంలో మ‌హాశివ‌రాత్రి ఉత్స‌వావాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. టీడీపీ నాయ‌కులు వేమిరెడ్డి విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి, ప‌ట్టాభిరామిరెడ్డిల‌ ఆధ్వ‌ర్యంలో ఈ వేడుక‌లు క‌నుల పండువ‌గా జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్ర‌వారం రాత్రి తెప్పోత్సవ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి హాజ‌ర‌య్యారు. ఆమెకు వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి, వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డిలు స్వాగ‌తంప‌లికారు. స్వామివారి దర్శనం అనంతరం బాణాసంచా కాల్పుల మ‌ధ్య తెప్పోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌శాంతిరెడ్డి మాట్లాడారు. గండవరం శివాలయం ఎంతో విశిష్టిత కలిగిన చారితాత్మక శైవ క్షేత్రమని అభివర్ణించారు. చోళ రాజుల కాలం నాటి శతాబ్దాల చరిత్ర కలిగిన ఉదయ కాళేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించే ఇటువంటి ధార్మిక ఉత్సవాలతో దైవిక చింతనతో పాటు గ్రామ ఐక్యతకు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. కనుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు జిల్లా న‌లుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, జ‌నాలు తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *