ఆ.. బ‌డిలో దొంగ‌లు ప‌డ్డారు..??

రూ.2.50ల‌క్ష‌ల విలువైన బాత్రూం కొళాయిలు, వాష్ బేషిన్‌లు ధ్వంసం

వాటి రాగి, ఇత్త‌డి కొళాయిలు, మూత‌లు మాయం – త‌లుపులు ప‌గ‌ల‌గొట్టి మ‌రీ ధ్వంసం

గ‌తంలోనూ ఇదే త‌ర‌హాలో న‌ష్ట‌ప‌ర‌చిన గుర్తుతెలియని వ్య‌క్తులు

ఇది దొంగ‌ల‌ప‌ని అని కొంద‌రు.. ఆక‌తాయిల‌వ‌ల్లేన‌ని ఇంకొంద‌రు

ఆ.. బ‌డిలో దొంగ‌లు ప‌డ్డారు..??
-రూ.2.50ల‌క్ష‌ల విలువైన బాత్రూం కొళాయిలు, వాష్ బేషిన్‌లు ధ్వంసం
-వాటి రాగి, ఇత్త‌డి కొళాయిలు, మూత‌లు మాయం
-త‌లుపులు ప‌గ‌ల‌గొట్టి మ‌రీ ధ్వంసం
-గ‌తంలోనూ ఇదే త‌ర‌హాలో న‌ష్ట‌ప‌ర‌చిన గుర్తుతెలియని వ్య‌క్తులు

-ఇది దొంగ‌ల‌ప‌ని అని కొంద‌రు.. ఆక‌తాయిల‌వ‌ల్లేన‌ని ఇంకొంద‌రు

ఆక‌తాయిలో.. దొంగ‌ల‌ప‌డ్డారో తెలియ‌దుగాని.. ఓ జిల్లా ప్ర‌జా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో విలువైన బాత్రూం సామాగ్రీ, కొళాయిలు, వాష్ బేషిన్లు ధ్వంసం చేసిన సంఘ‌ట‌న గురువారం వెలుగులోకి వ‌చ్చింది.
నెల్లూరు జిల్లా.. కొడవలూరు మండలం.. యల్లాయపాలెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని వ్య‌క్తులు సుమారు రెండు లక్షల యాభైవేలు విలువచేసే బాత్రూం కుళాయిలు ,వాష్ బేషిన్లు , త్రాగునీటి కుళాయిలు ధ్వంసం చేసారు. ఆపాఠ‌శాల త‌లుపులు ప‌గ‌ల‌గొట్టి మ‌రీ ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు. కొళాయిలు, వాష్ బేషిన్‌ల‌కు వ‌చ్చే రాగి, ఇత్త‌డి ని వారు దొంగిలించుకుని వెళ్లారు. అలాగే.. కొన్ని పైపుల‌ను కోసేశారు. దీన్ని ఉద్దేశ‌పూర్వ‌కంగా చేశారా..? ఆక‌తాయి త‌నంగా చేశారా..? లేక అక్క‌డ ప‌నిచేసే ఉపాధ్యాయులు, విద్యార్థుల‌ను ఇబ్బందుల‌కు గురిచేసేందుకు ఈ దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారా..? అనేది తెలియ‌రాలేదు. గ‌త ఏడాది కూడా ఈ పాఠ‌శాల‌లో ఇలాగే.. జ‌రిగింది. ఆ స‌మ‌యంలో ఉపాధ్యాయులు పోలీసుల‌కు ఫిర్యాదుచేసినా.. ఎలాంటి చ‌ర్యలు తీసుకోలేదు. దాంతో మ‌ళ్లీ అదే త‌ర‌హాలో ధ్వంసం జ‌రిగింది. పోలీసుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం అవుతున్నాయ‌ని అంటున్నారంతా. ఈవిష‌యం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయ‌కులు వంశీధ‌ర్‌రెడ్డి.. యస్ డి రియాజ్ , రామిరెడ్డి , రాఘవేంద్ర ,సురేంద్రల‌తో క‌ల‌సి.. సంఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. కొడ‌వ‌లూరు ఇన్‌ఛార్జి ముంగ‌మూరు శ్రీ‌హ‌రిరెడ్డికి తెలిపారు. ఆయ‌న త్వ‌ర‌లోనే మ‌ర‌మ్మ‌త్తులు చేయిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈవిష‌య‌మై ఆ పాఠ‌శాల పీఈటీ మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *