దోపిడీకి గుర‌వుతున్న కోవూరు షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ

2013లోనే లాక్ ఔట్ అయిన ఫ్యాక్ట‌రీ

గిట్టుబాటు ధ‌ర లేక‌పోవ‌డంతో ఆక్వావైపెళ్లిన చెర‌కు రైతులు

రూ.25కోట్ల‌పైనే బకాయిలు చెల్లించ‌ని ప్ర‌భుత్వాలు

రోడ్డున‌ప‌డ్డ 400 కుటుంబాలు

దోపిడీకి గుర‌వుతున్న విలువైన యంత్రాలు, సామాగ్రీ

ప్ర‌స్తుత దీనావ‌స్థ‌లోని షుగ‌ర్ ఫ్యాక్ట‌రీపై ఎన్‌-3 గ్రౌండ్ రిపోర్ట్‌

నెల్లూరు జిల్లా.. కోవూరు ప‌రిధిలో 1978లో ప్రారంభించిన షుగర్ ఫ్యాక్టరీని.. 2013 మూసి వేయడం జరిగింది.. చెరుకు ధ‌ర.. రైతుకు గిట్టుబాటు లేకపోవడం.. రైతు లను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం తో.. రైతులంతా ఆక్వా రంగంవైపు అడుగులు వేయ‌డంతో.. జిల్లాలో.. చెరుకు సాగు పూర్తిగా మ‌రుగున‌ప‌డింది. దాంతో.. షుగర్ ఫ్యాక్టరీ మూత పడింది. షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో 400 కుటుంబాలు వీధిన ప‌డ్డారు. వారికి రావాల్సిన బకాయిలు అక్ష‌రాలా.. 25 కోట్లు పైగా ఉండడంతో ఒకింత ప్ర‌భుత్వాల‌కు కూడా చెల్లించ‌డం భారంగా మారింది. అందువ‌ల్ల ఉద్యోగ‌, కార్మికులు అనేక పోరాటాలు చేశారు. అధికారుల‌కు విన్న‌వించుకున్నారు. అయినా.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. చివ‌ర‌కు కార్మికుల‌వైపు పోరాడే ప్ర‌జా సంఘాలు, వామ‌ప‌క్షాలు కూడా అల‌సిపోయాయి. కాల‌క్ర‌మంలో ఆ ఫ్యాక్ట‌రీలోని భారీ యంత్రాలు, ప‌నిముట్లు కోట్ల రూపాయిల విలువైన వ‌స్తువులు మాయం అయ్యాయి.. దోపిడీకి గుర‌య్యాయి. ఉన్న ఇద్ద‌రు సెక్యూరిటీ గార్డులను సైతం నిలిపేశారు. దీంతో షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ దోపిడీకి గుర‌వుతోంది. దీనికి పూర్వ వైభ‌వం తీసుకురాక‌పోయినా ప‌ర్వాలేదుగాని.. ఉద్యోగ‌, కార్మికుల‌కు చెల్లించాల్సిన బ‌కాయిలు ప్ర‌భుత్వం పై ఒత్తిడి తెచ్చి.. చెల్లించే ప్ర‌య‌త్నాలైనా చేస్తే బాగుంటుంద‌ని కోరాతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *