కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
బుచ్చి నగర పంచాయతిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే
ఎక్కువ మాట్లాడితే.. దెబ్బలు పడతాయ్
- కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి.
- బుచ్చి నగర పంచాయతిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే
ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడితే సహించేదెలేదని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ధ్వజమెత్తారు..నెల్లూరు జిల్లా బుచ్చి నగర పంచాయతిలో గ్రీన్ బుచ్చిరెడ్డిపాళెంలో భాగంగా ముంబై జాతీయ రహదారిపై చెట్లు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.. ముందుగా ఎమ్మెల్యేకు హారతులతో బ్రహ్మరథం పట్టారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మౌనంగా ఉంటూ వస్తుంటే..గత ప్రభుత్వ నాయకులు కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని సూచించారు.. చంద్రబాబు ప్రభుత్వంలో పల్లెల్లోని ప్రజలు పండగ చేసుకుంటున్నారనీ తెలిపారు. చెప్పిన మాట తప్పకుండా కోవూరు నియోజకవర్గంలో అవినీతి, వివాద రహిత పాలన అందిస్తున్నామనీ చెప్పారు..కోవూరు నియోజకవర్గంలో కూటమి పార్టీ నేతలు ప్రజల కోసం పాటు పడుతున్నారనీ ఎమ్మెల్యే ప్రశాంతి తెలిపారు