టైలర్ డేని విజయవంతం చేయాలి

కావలిలో నూతన అసోసియేషన్ ఏర్పాటు

ఈనెల 28వ తేదీన జరిగే టైలర్ల దినోత్సవానికి టైలర్లు అందరూ పాల్గొనాలని పిలుపు

టైలర్ డేని విజయవంతం చేయాలి…!

  • కావలిలో నూతన అసోసియేషన్ ఏర్పాటు
  • ఈనెల 28వ తేదీన జరిగే టైలర్ల దినోత్సవానికి టైలర్లు అందరూ పాల్గొనాలని పిలుపు

కావలి పట్టణంలో ఈనెల 28వ తేదీన జరిగే టైలర్ల దినోత్సవానికి పట్టణంలోని టైలర్లు అందరూ విధిగా హాజరయ్యి విజయవంతం చేయాలని కావలి టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. రమేష్ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా కావలిలోని జర్నలిస్టు క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ లో కోశాధికారిగా పి. వేణు, గౌరవ సలహాదారు రఫీ ఉన్నారు. ర్యాలీ జరుగుతుందని, అనంతరం జరిగే సభకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, డిఎస్పీ లను ఆహ్వానించినట్లు చెప్పారు. టైలర్స్ అనేక ఇబ్బందులు పడుతున్నారని, వీరికి ప్రభుత్వ సహకారం అవసరం అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పెంచలయ్య,కార్యదర్శి రెహమాన్, బద్రి నారాయణ, లక్ష్మయ్య, రవి, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *