రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
మూలస్థానేశ్వరాలయంలో శివయ్యని దర్శించుకున్న మంత్రి
రాష్ట్ర పండుగగా శివరాత్రి…
- రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
- మూలస్థానేశ్వరాలయంలో శివయ్యని దర్శించుకున్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ లోని ముప్పై శైవ క్షేత్రాల్లో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మహాద్భుతంగా నిర్వహిస్తున్నామని…రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా…నెల్లూరు నగరంలోని పురాతన స్వయంబు మూలస్తనేశ్వర శివాలయాన్ని మంత్రి ఆనం దర్శించుకొని…పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు ఆయన మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ అధికారులు, అర్చకులు మంత్రి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆనం మీడియాతో మాట్లాడారు. అన్ని శైవ క్షేత్రాల్లో ప్రత్యేక దేవాదాయ శాఖ అధికారిని నియమించి పర్యవేక్షిస్తున్నామన్నారు. గతం కన్నా ఎక్కువ భక్తులు వస్తున్నారన్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ మూడు ఆలయాల్లో శివరాత్రిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.