నాడు శంఖుస్థాప‌న‌… నేడు హెచ్చ‌రిక‌

వారం క్రితం నెల్లూరు రూర‌ల్ వైసీపీ కార్యాల‌య నిర్మాణానికి శంఖుస్థాప‌న చేసిన ఆనం

ఇరిగేష‌న్ స్థ‌లంటూ హెచ్చ‌రిక బోర్డు పెట్టిన అధికారులు

నాడు శంఖుస్థాప‌న‌…నేడు హెచ్చ‌రిక‌

  • వారం క్రితం నెల్లూరు రూర‌ల్ వైసీపీ కార్యాల‌య నిర్మాణానికి శంఖుస్థాప‌న చేసిన ఆనం
  • ఇరిగేష‌న్ స్థ‌లంటూ హెచ్చ‌రిక బోర్డు పెట్టిన అధికారులు

నెల్లూరు న‌గ‌రం ముత్తుకూరు గేటు జంక్ష‌న్ ఇరిగేష‌న్ కెనాల్ ప‌క్క‌నే ఉన్న 50 అంక‌ణాల స్థలంలో గ‌త వారం రోజుల క్రితం…వైసీపీ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఆనం విజ‌య‌కుమార్‌రెడ్డి నూత‌న వైసీపీ రూర‌ల్ కార్యాల‌య నిర్మాణానికి శంఖుస్థాప‌న చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యం తెలుసుకున్న ఇరిగేష‌న్ శాఖ అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని…ఇది ఇరిగేష‌న్ శాఖ‌కు సంబంధించిన స్థ‌ల‌మ‌ని… ఎలా నిర్మాణాలు చేప‌డుతారంటూ….స్థ‌లం జ‌ల‌వ‌న‌రుల శాఖ‌కు సంబంధించిన‌ది ఆక్ర‌మించిన వారు శిక్షార్హులు…ఇట్లు జ‌ల‌వ‌న‌రుల శాఖ.. అని హెచ్చ‌రిక బోర్డు ఏర్పాటు చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. గ‌తంలో ఆనం పూర్వీకుల ఆదీనంలో ఆ స్థలం ఉంది. అప్ప‌ట్లో.. అందులో రైస్ మిల్లు ఉంది. అప్ప‌ట్లో వారు ఇరిగేష‌న్ శాఖ వ‌ద్ద లీజుకు తీసుకుని ఉన్న‌ట్లు స‌మాచారం.ఆ లీజు గ‌డువు కూడా చాలా కాలంక్రితం పూర్త‌య్యింది. అయితే.. తాజాగా ఆ స్థ‌లంలో ఆనం విజ‌య్‌కుమార్‌రెడ్డి నెల్లూరు రూర‌ల్ వైసీపీ కార్యాల‌యం ఏర్పాటు చేయ‌డంతో ఈ వ్య‌వహారం వెలుగులోకి వ‌చ్చింది. ఏది ఏమైనా… వారం రోజుల క్రితం శంఖుస్థాప‌న చేసిన స్థ‌లంలోనే….నేడు హెచ్చ‌రిక అంటూ బోర్డు పెట్ట‌డం ప్ర‌స్తుతం న‌గ‌రంలో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *