ప్ర‌యాగ్ రాజ్‌లో మంత్రి నారాయ‌ణ

మహా కుంభమేళా ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మంత్రి,మున్సిపల్ శాఖ అధికారులు

ప్ర‌యాగ్ రాజ్‌లో మంత్రి నారాయ‌ణ

  • మహా కుంభమేళా ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మంత్రి,మున్సిపల్ శాఖ అధికారులు

మ‌హా కుంభ‌మేళా ఏర్పాట్ల ప‌రిశీల‌నలో భాగంగా….ప్ర‌యాగ్ రాజ్‌లో రాష్ట్ర పురపాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ బృందం ప‌ర్య‌టించింది. ఈ సంద‌ర్భంగా మంత్రి నారాయ‌ణ బోటులో త్రివేణీ సంగమం వరకూ ప్రయాణించి ఘాట్ల వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. స్నాన ఘాట్ ల వద్ద ఏర్పాట్లు, పారిశుధ్య సమస్య లేకుండా తీసుకున్న జాగ్రత్తలు,చెత్త నిర్వహణతో పాటు ఇతర ఏర్పాట్ల ను ఆయ‌న సంద‌ర్శించారు. జూలై 2027లో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం కుంభమేళా ఏర్పాట్లను అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి నారాయ‌ణ తెలిపారు. మంత్రి వెంట మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్,రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *