వీపీఆర్ దంపతుల సౌజన్యంతోనే ఇస్తిమా విజయవంతం
ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 లక్షల వాటర్ బాటిళ్లు, వాటర్ ట్యాంకుల అందజేత
ఇస్తిమా విజయవంతంపై ధన్యవాదాలు తెలిపిన ముస్లిం నేతలు
వేమిరెడ్డి దంపతులకు అల్లాహ్ ఆశీసులు ఉండాలి…
- వీపీఆర్ దంపతుల సౌజన్యంతోనే ఇస్తిమా విజయవంతం
- ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 లక్షల వాటర్ బాటిళ్లు, వాటర్ ట్యాంకుల అందజేత
- ఇస్తిమా విజయవంతంపై ధన్యవాదాలు తెలిపిన ముస్లిం నేతలు
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం వద్ద రెండు రోజులు నిర్వహించిన తబ్లిగ్ ఎ జమాత్ రాష్ట స్థాయి ఇస్తిమా విజయవంతం కావడంపై ఇస్తిమా నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఇస్తిమా విజయవంతంలో ప్రధాన పాత్ర వహించిన వేమిరెడ్డి దంపతులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఇస్తిమా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల పాటు నిర్వహించిన తబ్లిగ్ ఎ జమాత్ రాష్ట స్థాయి ఇస్తిమా ముగింపు సందర్భంగా ఆ సంస్థ జిల్లా కార్యదర్శి నిజాముద్దీన్ విపిఆర్ ఫౌండేషన్ సేవలను కొనియాడారు. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్ల సహాయ సహకారాలతో రాష్టం నలుమూలల నుంచి లక్షకు పైగా భక్తలు హాజరైనా.. ఎక్కడా ఇబ్బందులు లేవన్నారు. స్థానిక గ్రామాల ప్రజలు కూడా తమకు ఎంతో సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. విపిఆర్ దంపతులకు అల్లాహ్ దీవెనలు ఎప్పుడూ ఉంటాయని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సయ్యద్ నౌషాద్, కొడవలూరు మండల టిడిపి నాయకులు సతీష్, నాగేశ్వరరావుతో పాటు పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.