మా సమస్యల్ని పట్టించుకున్న పాపాన పోలేదు
నెల్లూరు కలెక్టరేట్ వద్ద ది కోవూరు కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు నిరసన
అందరూ చెబుతూనే ఉన్నారు…..
- మా సమస్యల్ని పట్టించుకున్న పాపాన పోలేదు
- నెల్లూరు కలెక్టరేట్ వద్ద ది కోవూరు కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు నిరసన
తమ సమస్యలన్నింటిని పరిష్కరిస్తాం…పెండింగ్ ఉన్న జీతాలు వెంటనే చెల్లిస్తాం…అని చెబుతున్నారే తప్ప…ఏ ప్రభుత్వం కానీ…ఏ ఎమ్మెల్యే కానీ…తమను పట్టించుకున్న పాపాన పోలేదని… కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ది కోవూరు కో – ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆనంద్కు వినతి పత్రం అందచేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్లుగా షుగర్ ఫ్యాక్టరీలో పని చేసిన ఉద్యోగులు, కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలను ప్రభుత్వం వెంటనే ఇచ్చి తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.