నెల్లూరు జిల్లా లింగసముద్రం మండల సమావేశంలో బస్తీమే సవాల్
మండల సమావేశం వాయిదా వేసిన ఎంపీపీపై టీడీపి నేతల గరంగరం
పాత పనులకు బిల్లులు చెల్లింపులు అయ్యాకనే కొత్త పనులకు సహకరిస్తామంటున్న వైసీపీ
పనులు చేయకుండానే బిల్లులు నొక్కేకుట్ర ఎంపీపీ చూస్తున్నారని టీడీపి నేతల ఆరోపణ
- నెల్లూరు జిల్లా లింగసముద్రం మండల సమావేశంలో బస్తీమే సవాల్
- మండల సమావేశం వాయిదా వేసిన ఎంపీపీపై టీడీపి నేతల గరంగరం
- పాత పనులకు బిల్లులు చెల్లింపులు అయ్యాకనే కొత్త పనులకు సహకరిస్తామంటున్న వైసీపీ
- పనులు చేయకుండానే బిల్లులు నొక్కేకుట్ర ఎంపీపీ చూస్తున్నారని టీడీపి నేతల ఆరోపణ
నెల్లూరు జిల్లా లింగసముద్రం మండల పరిషత్ నిధుల కోసం వైసీపీ, టీడీపి నేతల మధ్య వార్ నడుస్తోంది. ఆదివారం జరిగిన మండల సమావేశంలో గందరగోళం నెలకొంది. ఎంపీపీ కృష్ణయ్య, టీడీపి నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో మండల సమావేశాన్ని ఎంపీపీ వాయిదా వేశారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మీడియాతో మాట్లాడారు. సమావేశానికి సంబంధం లేని బయట వ్యక్తులు టీడీపి నేతలు గందర గోళం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో గ్రామాల్లో శానిటేషన్, తాగునీటి వంటి పనులు ఎంపీటీసీ లు, సర్పంచులు చేశారన్నారు. ఇలా పాత బిల్లులు 21 లక్షలు చెల్లించాల్సిందన్నారు. ఈ బిల్లులు ఇవ్వకుండానే మండల గ్రాంట్ 50 లక్షల రూపాయలు మాకివ్వాలని, మేము పనులు చేస్తామని టీడీపి నేతలు కోరడం సరికాదన్నారు. ఈ వ్యవహారాన్ని మండలిలో ప్రశ్నిస్తానని, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళతానన్నారు. టిడిపి మండల కన్వీనర్ మాట్లాడుతూ గ్రామాల్లో పనులు చేయకుండానే బిల్లులు చేసుకునేందుకు ఎంపీపీ కృష్ణయ్య కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు. గత సమావేశానికి ఎమ్మెల్యే నాగేశ్వరరావు హాజరవుతాడని కావాలనే సమావేశాన్ని ఎంపీపీ వాయిదా వేశాడన్నారు. మళ్ళీ మూడు నెలల తర్వాత జరిగిన ఈ సమావేశాన్ని ఎంపీపీ ఎందుకు వాయిదా వేశాడో అర్థం కావడం లేదన్నారు. లింగసముద్రం మండల అభివృద్ధికి ఎంపీపీ కృష్ణయ్య ఆటంకంగా మారారని టీడీపి నేతలు మండిపడుతున్నారు.