ఉదయగిరి మండలం గండిపాలెం గురుకుల పాఠశాలలో చపాతీలు చేస్తున్న వీడియోలు వైరల్ విద్యార్థులచేత చాకిరి చేయిస్తున్నట్లు ఆరోపణలు
వివరణ కోరేందుకు N3 న్యూస్ ప్రయత్నం..స్పందించని ప్రిన్సిపాల్
కుక్కులుగా విద్యార్థులు
- ఉదయగిరి మండలం గండిపాలెం గురుకుల పాఠశాలలో చపాతీలు చేస్తున్న వీడియోలు వైరల్
- విద్యార్థులచేత చాకిరి చేయిస్తున్నట్లు ఆరోపణలు
- వివరణ కోరేందుకు N3 న్యూస్ ప్రయత్నం..స్పందించని ప్రిన్సిపాల్
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెం గురుకుల పాఠశాలలో విద్యార్థులు కుక్కులుగా మారారు. ఆదివారం ఉదయాన్నే చపాతీల తయారీ చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. విద్యార్థులు గోధుమపిండిని కలుపుతూ, వంటశాలలో పనులు చేస్తున్న వైనం బయట పడింది. ఉదయాన్నే నిద్రలేపి చదివించాల్సిన పాఠశాల యాజమాన్యం ఇలా విద్యార్థులచేత చాకిరి చేయించడం విమర్శలకు తావిస్తుంది. ఈ విషయమై ప్రిన్సిపాల్ వివరణ కోరేందుకు ఎన్ త్రీ న్యూస్ ఫోన్ లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.