టీపీ గూడూరు మండల వెలుగు కార్యాలయంలో బాహాబాహీకి దిగిన ఇద్దరు సీసీలు
భయాందోళనకు గురైన తోటి ఉద్యోగ, సిబ్బంది
మహిళల కుమ్ములాట..!
-టీపీ గూడూరు మండల వెలుగు కార్యాలయంలో బాహాబాహీకి దిగిన ఇద్దరు సీసీలు
-భయాందోళనకు గురైన తోటి ఉద్యోగ, సిబ్బంది
బాధ్యతగా వ్యవహరించాల్సిన ఇద్దరు మహిళలు బూతు పురాణంతో.. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సర్వేపల్లి నియోజకవర్గం.. తోటపల్లిగూడూరు వెలుగు కార్యాలయంలో పనిచేసే.. సీసీ.., సౌత్ ఆములూరు సీసీలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఆ కార్యాలయంలో ఉన్న కర్రలు, ఇతర వస్తువులతో దాడికి పాల్పడ్డంతోపాటు బూతు పురాణంతో అరుపులు, కేకలుతో ఆ కార్యాలయంలోని ఉద్యోగులుంతా విస్తుపోయారు. వీరి మధ్య ఘర్షణకు వ్యక్తిగత వివాదాలే కారణమని.. గతంలో పనిచేసిన మండలంలో కొన్ని సమస్యలున్నట్లు తెలుస్తోంది. ఈవిషయమై ఇరువురు సీసీలు పరస్పరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు విచారిస్తున్నారు.