నెల్లూరంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ప్ర‌త్యేక అభిమానం

నెల్లూరులో బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఉంది

రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖామంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌

నెల్లూరు జ‌న‌సేన కార్యాల‌యంలో మంత్రికి అపూర్వ స్వాగ‌తం

భారీ గ‌జ‌మాల‌తో స్వాగ‌తం ప‌లికిన జ‌న‌సేన నేత‌లు

నెల్లూరంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ప్ర‌త్యేక అభిమానం…

  • నెల్లూరులో బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఉంది
  • రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖామంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌
  • నెల్లూరు జ‌న‌సేన కార్యాల‌యంలో మంత్రికి అపూర్వ స్వాగ‌తం
  • భారీ గ‌జ‌మాల‌తో స్వాగ‌తం ప‌లికిన జ‌న‌సేన నేత‌లు

నెల్లూరులో జ‌న‌సేన పార్టీకి బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఉంద‌ని…ముఖ్యంగా నెల్లూరంటే…ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ప్ర‌త్యేక అభిమానం అని…రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖామంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ తెలిపారు. నెల్లూరు జిల్లా ప‌ర్య‌ట‌న విచ్చేసిన మంత్రి నాదెండ్ల‌కి జ‌న‌సేన శ్రేణులు అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. ముందుగా ఆయ‌న్ని భారీ గ‌జ‌మాల‌తో ఘ‌నంగా స‌త్క‌రించి…క‌త్తి, గ‌ధ‌ను బ‌హుక‌రించారు. జై జ‌న‌సేన… జై జై జ‌న‌సేన అంటూ జ‌న‌సైనికులు నినాదాలు మారుమోగించారు. అనంత‌రం ఆయ‌న ఓ క‌ళ్యాణ మండ‌పంలో జ‌న‌సైనికుల‌తో స‌మావేశ‌మై వారికి దిశా నిర్దేశం చేశారు. నెల్లూరు జిల్లాలో జ‌న‌సేన బ‌లంగా ఉంద‌ని… ఇంకా బ‌లంగా మార్చుకోవాల‌ని…అందుకు ప్ర‌తీ జ‌న‌సైనికుడు క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాల‌ని ఆయ‌న సూచించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర టిడ్కో చైర్మ‌న్ వేముల‌పాటి అజ‌య్‌కుమార్‌, జ‌న‌సేన నగ‌రాధ్య‌క్షుడు సుజ‌య్‌బాబు, జ‌న‌సేన ముఖ్య నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *