7 స్థాయి సంఘాల‌తో ఆనం స‌మీక్ష‌

ప్ర‌స్తుత ప్ర‌గ‌తిని జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ ఆనం అరుణ‌మ్మ‌కు వివ‌రించిన ప్రభుత్వ విభాగాల అధికారులు

7 స్థాయి సంఘాల‌తో ఆనం స‌మీక్ష‌….

  • ప్ర‌స్తుత ప్ర‌గ‌తిని జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ ఆనం అరుణ‌మ్మ‌కు వివ‌రించిన ప్రభుత్వ విభాగాల అధికారులు

నెల్లూరు జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యంలో స్థాయి సంఘాల స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ ఆనం అరుణ‌మ్మ అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ స‌మావేశంలో మొత్తం ఏడు స్థాయి సంఘాల ప్ర‌భుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్ర‌ధానంగా జిల్లా గృహ నిర్మాణ‌, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, పారిశుధ్య, ప‌రిశ్ర‌మ‌లు, విద్యుత్‌, జిల్లా కో ఆప‌రేటివ్‌, రిజిస్ట్రేష‌న్‌, వ్య‌వ‌సాయం, మైక్రో ఇరిగేష‌న్‌, విద్య‌, వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్‌, నైపుణ్యాభివృద్ధి, ఐటీడీఏ, వ‌యో వృద్ధుల సంక్షేమం, సాంఘిక సంక్షేమం, జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం, పంచాయితీ రాజ్, నీటిపారుదల, రహదారులు భవనాలు మొత్తం ఏడు శాఖ‌లపై ఆమె స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఆయా విభాగాల‌కు సంబంధించిన అనేక అంశాలు, వాటి ప్ర‌స్తుత ప్ర‌గ‌తిని గౌర‌వ స‌భ్యుల‌కు వివ‌రించారు. ఈ సమావేశానికి జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ విద్యారమ గారు, జెడ్పిటిసిలు, నెల్లూరు,తిరుపతి జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *