ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభం అయినట్లే…

నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులతో కలిసి ఎంపీలు వేమిరెడ్డి, బీద, ఎమ్మెల్యే కావ్య, కలెక్టర్ భూములు సందర్శన

ఎయిర్ పోర్ట్ కల సాకారం కాబోతుందన్న ఎంపీలు, ఎమ్మెల్యే

రైతులకు న్యాయం జరిగేలా భూసేకరణ చేయాలని కలెక్టర్ కు సూచన

ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభం అయినట్లే…!

  • నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులతో కలిసి ఎంపీలు వేమిరెడ్డి, బీద, ఎమ్మెల్యే కావ్య, కలెక్టర్ భూములు సందర్శన
  • ఎయిర్ పోర్ట్ కల సాకారం కాబోతుందన్న ఎంపీలు, ఎమ్మెల్యే
  • రైతులకు న్యాయం జరిగేలా భూసేకరణ చేయాలని కలెక్టర్ కు సూచన

నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్ పోర్ట్ కల సాకారం కాబోతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్య సభ సభ్యులు బీద మస్తాన్ రావు, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిలు తెలిపారు. శుక్రవారం దగదర్తిలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ భూములను ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు, జిల్లా కలెక్టర్ ఆనంద్ తో కలిసి వారు సందర్శించారు. ఎయిర్ పోర్ట్ డిజైన్ ను, 2019 లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డీ మాట్లాడుతూ.. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంతగానో స్పందించి ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులను పంపించారని సంతోషం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి లో టీడీపి భాగస్వామ్యం కావడంతోనే అనేక పరిశ్రమలు జిల్లాకు క్యూ కడుతున్నట్లు చెప్పారు. గ్రామాలకు ఇబ్బందిలేని పరిశ్రమలకే పచ్చ జెండా ఊపుతామని చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా, వారికి న్యాయం జరిగేలా భూసేకరణ చేయాలని రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు సూచించారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ… కావలి ప్రాంతానికి విమానాశ్రయం నిర్మించాలని 2019లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తే గత ఐదేళ్ల వైసిపి పాలనలో నిర్వీర్యం చేశారన్నారు. మళ్ళీ ఈ ఎయిర్ పోర్ట్ ను పట్టాలెక్కించేందుకు ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావులు ముందుకు రావడం చాల సంతోషంగా ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *