సంక్షేమ పథకాలన్నీ NTR తెచ్చినవే

పేదల కోసం పాలన చేసిన ముఖ్యమంత్రి NTR.

టీడీపీ ఆధ్వర్యంలోముత్తుకూరు లో NTR వర్ధంతి

సంక్షేమ పథకాలన్నీ NTR తెచ్చినవే.
పేదల కోసం పాలన చేసిన ముఖ్యమంత్రి NTR.
టీడీపీ ఆధ్వర్యంలోముత్తుకూరు లో NTR వర్ధంతి

కిలో రెండు రూపాయల బియ్యం, పక్కా ఇళ్ళు, పెన్షన్ తదితర సంక్షేమ పడక ప్రవేశపెట్టిన గొప్ప ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అని టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు… అనంతరం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ… నాడు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ నేడు కోటి మంది సభ్యత్వాలతో ముందుకు వెళ్తుందని చెప్పారు. నాడు ముఖ్యమంత్రి గా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలను అందరూ ముఖ్యమంత్రులు కొనసాగిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ మత్స్యకార విభాగం అధ్యక్షుడు అక్కయ్యగారి ఏడుకొండలు, నాయకులు షేక్. అబ్దుల్ షఫీవుల్లా, శ్రీనివాసులు, శ్రీనివాసులు రెడ్డి, నాగార్జున, పరశురాం, శ్రీహరి, దుర్గ పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *