ఇద్దరు నింధితులను అదుపులోకి తీసుకున్న నాయుడుపేట సీఐ
తిరుపతి జిల్లా నాయుడుపేట సీఐ బాబీ శనివారం అంతర్రాష్ట్ర మోటార్ వెహికల్ దొంగల ఆటకట్టించారు. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో నిత్యం బైక్లను చోరీ చేస్తున్న ముఠా నుంచి తొమ్మిది బైకులు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ బావి తెలిపారు. ముగ్గురు తమిళనాడుకు చెందిన వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతున్నారని సీఐ చెప్పారు. ప్రస్తుతం ఇద్దరిని అదుపులో తీసుకొని విచారించామని, మరొకరు పరారీలో ఉన్నారన్నట్లు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ప్రంట్ వీల్ లాక్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సీఐ బాబీ సూచించారు.