రిలయన్స్ భూములను పరిశీలించిన రిలయన్స్ ఏడీఏ చైర్మన్ అనీల్ అంబాని
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలోని రిలయన్స్ భూములను రిలయన్స్ ఏడీఏ చైర్మన్ అనీల్ అంబాని పరిశీలించారు. నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్తీక్, పలువురు అధికారులతో కలిసి ఆయన రిలయన్స్ భూములను సందర్శించారు. గత కొద్ది రోజులుగా రిలయన్స్ భూములపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో అంబానీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దీనిపై పూర్తి వివరాలు అధికారులు ప్రకటించాల్సి ఉంది.