నవాబ్పేట శ్రీనివాసనగర్లో ఘటన
సంఘటన స్థలాన్ని పరిశీలించిన నగర డీఎస్పీ సింధుప్రియా
నెల్లూరు నగరంలోని నవాబ్పేట శ్రీనివాసనగర్లో మాబాషా అనే వ్యక్తి శనివారం రాత్రి దారుణహత్యకు గురయ్యారు. షాహిద్ అనే వ్యక్తి మాబాషాపై కత్తితో దాడి చేసినట్లు స్థానికుల ద్వారా సమాచారం. ఈ విషయం తెలుసుకున్న నగర డీఎస్పీ సింధుప్రియా, సీఐ అన్వర్బాష సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికంగా విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు డీఎస్పీ సింధుప్రియ తెలిపారు.