మ‌ళ్లీ తెర‌పైకి జ‌య‌వ‌ర్ధ‌న్‌

మేయ‌ర్ పేషీ వేదిక‌గా కొత్త వివాదం

త‌మ పేషీలోకి క‌మిష‌న‌ర్ సీసీ వెళ్లాడంటున్న మేయ‌ర్ దంప‌తులు

విధి నిర్వ‌హ‌ణ‌లో మేయ‌ర్ భ‌ర్త ఆటంకం క‌లిగించాడంటూ జ‌య‌వ‌ర్ధ‌న్‌పై కేసు

నెల్లూరు నగర కార్పొరేషన్ లో మ‌రో సారి మేయ‌ర్ స్ర‌వంతి భ‌ర్త జ‌య‌వ‌ర్ధ‌న్ వ్య‌వ‌హారం తెర‌పైకి వ‌చ్చింది. అయితే ఈ సారి క‌మిష‌న‌ర్ సీసీ వ‌ర్సెస్ మేయ‌ర్ దంప‌తులు కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. మీడియాకు ఉన్న స‌మాచారం మేర‌కు…ప్రింట్ అవుట్ తీసుకునేందుకు మేయ‌ర్ పేషీలోకి క‌మిష‌న‌ర్ సీసీ వెళ్లాడ‌ని…అయితే త‌మ అనుమ‌తి లేకుండా త‌మ పేషీలోకి ఎలా వ‌స్తారంటూ మేయ‌ర్ దంప‌తుల‌కు క‌మిష‌న‌ర్ సీసీ ప్ర‌వీణ్ కు మ‌ధ్య వాగ్వివాదం జ‌రిగింద‌ని…ఈ క్ర‌మంలో మాట మాట పెరిగి కేసు వ‌ర‌కు వెళ్లింద‌ని కొంద‌రు చెబుతుండ‌గా, మ‌రో వైపు క‌మిష‌న‌ర్ సీసీని మేయ‌ర్ స్ర‌వంతి భ‌ర్త జ‌య‌వ‌ర్ధ‌న్ అకార‌ణంగా దూషించి కార్పొరేష‌న్ ప‌రిధిలో దుర్భాష‌లాడి త‌న విధుల‌కు ఆటంకం క‌లిగించిన‌ట్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా ఈ వివాదానికి మ‌రొక కోణం తోడైంది. మేయ‌ర్ పేషీ వేదిక‌గా చెల‌రేగిన వివాదం పెద్దది కావడంతో పాటు పోలీసులు, జిల్లా కలెక్టర్ దృష్టికి చేరుకుంది. అయితే క‌మిష‌న‌ర్ సీసీ కానీ, ఇటు మేయ‌ర్ దంప‌తులు కానీ మీడియా ముందుకు వ‌చ్చి వివ‌రాలు వెల్ల‌డించే వ‌ర‌కు ఈ వివాదంపై నిజా నిజాలు తేల్చ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *