వరికుంటపాడు మండలం కనియంపాడులో అగ్రిగోల్డ్ జామాయిల్ అక్రమ తరలింపు
సంరక్షించని తహశీల్దారు, ఎస్సై, సీఐడీ పై కోర్టులో కేసులు
సంచలన వ్యాఖ్యలు చేసిన అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి తిరుపతయ్య
యదేచ్చగా అగ్రిగోల్డ్ సంపద దోపిడీ చేస్తుంటే అధికారులు చేతులుకట్టుకుని ఉన్నారంటే దీనివెనుక పెద్దశక్తి ఉందని, అది ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు మాకు బయట వినొస్తున్న మాటలనుచూస్తే అర్థం అవుతుందని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, సీపీఐ నాయకుల తో కలిసి వరికుంటపాడు మండలం కనియంపాడులో అగ్రిగోల్డ్ జామాయిల్ తోటలను పరిశీలించారు. ఈ నెల ఐదో తేదీన వీరు పరిశీలించినప్పుడు నరికి అక్కడ పడేసిన జామాయిల్ కర్ర అక్కడ లేకపోవడంతో విస్మయం వ్యక్తం చేశారు. కనీసం గుర్తించి తాము పిర్యాదు చేశాకకూడా జామాయిల్ కర్ర తరలించడం చాలా బాధాకరం అన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో 250 ఎకరాల్లో కోట్లాది రూపాయల జామాయిల్ కర్ర తరలించారని ఆయన ఆరోపించారు. అగ్రిగోల్డ్ సంపదను సంరక్షించడంలో నిర్లక్ష్యం వహించిన ప్రస్తుత తహశీల్దారు, ఎస్సై, సీఐడీ పై కోర్టులో కేసులు వేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విచారణ చేయించాలని, లేదంటే ఆమరణ దీక్షకైనా వెనుకాడేదిలేదని తేల్చి చెప్పారు.