స్పందించిన జీజీహెచ్ అధికారులు
దివ్యాంగులకి భోజన ఏర్పాట్లు, టోకన్లు వారీగా సర్టిఫికేషన్ల వెరిఫికేషన్
నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో…దివ్యాంగులకి సదరం సర్టిఫికేట్ల రీ వెరిఫికేషన్ జరుగుతోంది. దీనిపై సదరం కోసం నరకం అన్న కథనాన్ని ఎన్3 న్యూస్ ప్రసారం చేసింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో… జీజీహెచ్ అధికారులు వెంటనే స్పందించారు. వెరిఫికేషన్ వచ్చిన దివ్యాంగులు, వారి తల్లిదండ్రులకి భోజనం ఏర్పాటు చేయడంతోపాటు…టోకన్లు వారీగా రీ వెరిఫికేషన్ చేస్తున్నారు. అలాగే నర్సింగ్ స్టాఫ్ సంఖ్యని పెంచి దివ్యాంగులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో…జీజీహెచ్ సదరం సర్టిఫికేట్ల రీ వెరిఫికేషన్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి రమణారెడ్డి అందిస్తారు..