రూ. 30 ల‌క్ష‌లు @ 56 మోటారు బైక్‌లు

అంతరాష్ట్ర మోటార్ సైకిళ్ల దొంగలు అరెస్టు

మీడియా స‌మావేశంలో వివ‌రాలు వెల్ల‌డించిన జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్‌

ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి రాష్ట్రంలోని పలు జిల్లాలలో మోటార్ సైకిల్స్ దొంగతనములు చేసి తప్పించుకొని తిరుగుచున్న అల్లూరుకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వ‌ద్ద నుంచి రూ. 30 ల‌క్ష‌లు విలువ చేసే 56 మోటారు సైకిళ్ల‌ను స్వాధీనం చేసుకోవ‌డం జ‌రిగింద‌ని జిల్లా ఎస్పీ జీ కృష్ణ‌కాంత్ తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫ‌రెన్స్ హాల్‌లో నిందితుల్ని మీడియా ఎదుట హాజ‌రుప‌ర‌చి…కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించారు. నిందితులు ఆవ‌ల శివ‌, కామంచి నాని, శ్రీ‌రామ్ ర‌వి దుర్గ‌, న‌ల్ల‌గుండ్ల హూస‌న్న‌ల‌ను ప‌ద్మ‌నాభ స‌త్రం వ‌ద్ద పోలీసులు అరెస్ట్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ కేసును చేధించ‌డంలో ప్ర‌తిభ చూపిన పోలీసుల్ని ఎస్పీ ప్ర‌త్యేకంగా అభినందించి రివార్డులు అంద‌చేశారు. ఈ స‌మావేశంలో అడిష‌న‌ల్ ఎస్పీ సీహెచ్ సౌజ‌న్య‌, రూర‌ల్ డీఎస్పీ శ్రీ‌నివాస‌రావు, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *