భూములివ్వం తెగేసి చెప్పిన రైతులు

కావలి మండలం చెన్నై పాలెం లో భూసేకరణ గ్రామసభ

గ్రామ సభకు హాజరైన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, కావలి ఆర్డీవో, తహసిల్దారు.

అధికారులు మాట్లాడుతుండగానే గ్రామస్థులు నిరసన

మాకు అభివృద్ధి వద్దు… పరిశ్రమలు వద్దు… ఉద్యోగాలు అంతకంటే వద్దు… మా బతుకులు మేము బతుకుతామని…మా జీవితాలు నాశనం అయ్యేలా అధికారులు నిర్ణయాలు తీసుకోవద్దని కోరుతున్నారు కావలి మండలం ఆనెమడుగు గ్రామస్థులు. రామాయపట్నం కోర్టు అనుసంధానంగా స్థాపించే పరిశ్రమల కోసం గ్రామంలో భూసేకరణకు కావలి ఆర్డీవో వంశీ కృష్ణ ఆధ్వర్యంలో అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్ట భూములకు 8 లక్షలు, మాగాణి భూములకు 11 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పడంతో రైతులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. పరిహారం ప్రకటనపై ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. మూడు కార్లు పండించుకుంటూ జీవిస్తున్న మా జీవితాలను నాశనం చేసేందుకు వచ్చారా అంటూ మండిపడ్డారు. ఒకపక్క గ్రామంలో ఎకరా భూమి 30 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు కొనుగోలు చేస్తుంటే… మీరిచ్చే పరిహారం 12 లక్షల రూపాయలను మించడం లేదని వాపోయారు. దీంతో అధికారులు గ్రామసభను ముగించి వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దారు శ్రావణ్ కుమార్, మారిటైంబోర్డ్ తహసిల్దార్ శ్రీనివాసులు, మారిటైం బోర్డు డిప్యూటీ తాసిల్దార్ లక్ష్మీ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *