పోలీసుల్ని సూటిగా ప్రశ్నించిన నేదురుమల్లి
300 గ్రాముల గంజాయి దొరికితేనే ప్రెస్మీట్ పెట్టే పోలీసులు…23 కేజీల గంజాయి దొరికినా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదో చెప్పాలని….పోలీసుల్ని తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వవయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వెంకటగిరి మండలంలోని ఎన్జేఆర్ భవన్లో ఆయన స్థానిక వైసీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అధికారులకి తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. తప్పు చేస్తున్నారని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదన్నారు.