26 ఏళ్ల కృష్ణ చైతన్య కాలేజీ ప్రస్థావనపై పర్వతరెడ్డి భావోద్వేగం
ఘనంగా కృష్ణ చైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ వార్షికోత్సవ వేడుకలు
నాడు 140..నేడు 17వేల మంది
- 26 ఏళ్ల కృష్ణ చైతన్య కాలేజీ ప్రస్థావనపై పర్వతరెడ్డి భావోద్వేగం
- ఘనంగా కృష్ణ చైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ వార్షికోత్సవ వేడుకలు
తమ కృష్ణ చైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ ని 140 మంది విద్యార్థులతో ప్రారంభించి…నేడు 17వేల మందికి ఉన్నతమైన విద్యను అందిస్తున్నామని…దిగ్విజయంగా 26 ఏళ్లు పూర్తి చేసుకున్నామని… కృష్ణ చైతన్య కాలేజీ ప్రస్థావనపై…కళాశాల డైరెక్టర్ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. నెల్లూరులోని అనిల్ గార్డెన్స్ లో… కృష్ణ చైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ 26వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో…కళాశాల కరస్పాండెంట్లు కృష్ణారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, పర్వతరెడ్డి ప్రమోద్ రెడ్డిలు పాల్గొన్నారు. వీరికి కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేదికపై పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పిల్లల్ని ఉద్దేశించి ప్రసంగించారు. 26 ఏళ్ల కాలేజీ ప్రస్థావనపై వివరించారు. అనంతరం చంద్రశేఖర్రెడ్డి, కృష్ణారెడ్డి, ప్రమోద్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. తమ కళాశాలలో చదువుకున్న వారి పిల్లలు.. నేడు.. తమ కళాశాలల్లో విద్య ను అభ్యసించడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్లు రామాంజనేయులు రెడ్డి, రాంగోపాల్ రెడ్డి, పాయసం రమేష్, ఏ ఒ హరి , చిరంజీవి సుధారాణి , అన్ని క్యాంపస్ ల ప్రిన్సిపల్స్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.