తిరుమలలో మరో అపశృతి

47వ ల‌డ్డు కౌంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదం

తిరుమ‌లలో మ‌రో అప‌శృతి చోటు చేసుకుంది. 47వ నెంబ‌ర్ ల‌డ్డూ కౌంట‌ర్‌లోని యూపీఎస్‌లో షార్ట్ స‌ర్క్యూట్ రావ‌డంతో మంట‌లు వ్యాపించాయి. దీంతో కౌంట‌ర్ అంతా పొగ అలుముకుంది. ఈ ఘ‌ట‌న‌తో భ‌క్తులు భ‌య‌బ్రాంతుల‌కు గుర‌య్యారు. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తీసుకురావ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది. అధికారులు, భ‌క్తులు ఊపిరి పీల్చుకున్నారు. మొన్న తొక్కిస‌లాట‌…నేడు ల‌డ్డూ కౌంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదంతో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *